కాజీపేట జాతీయ రహదారి లో భూములు కొంటున్న వ్యాపారస్తులకు నిరాశ ?
కడప జిల్లాలో ఎక్కడా లేని విధంగా కాజీపేట మండలంలోని వివిధ ప్రాంతాలలో లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న సందర్భంలో జాతీయ రహదారి దుంపలగట్టు ప్రాంతంలో భూముల రేట్లు అమాంతంగా పెరిగిపోవడంతో ఒకింత ఆశ్చర్యానికి లోనైన రైతులు.
వివరాల్లోకి వెళితే కడప కార్పొరేషన్ పరిధిలో ఉన్న టోల్ ప్లాజా అక్కడి నుంచి తొలగించి దుంపలగట్టు ప్రాంతంలో నిర్మిస్తున్నారని పుకార్లు షికార్లు చేయడంతో చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు 50 లక్షలు ఉన్న భూమిని అమాంతంగా కోటి వరకు పెంచడం కొనడం జరిగింది.
జాతీయ రహదారి ఒక అధికారిని ఈ విషయంపై వివరాలు అడగగా భారతదేశంలో ఇంత వరకు రెండు చోట్ల మాత్రమే టోల్ ప్లాజా మార్చడం జరిగింది. అది కూడా జాతీయ రహదారి ఒకటి మరియు రెండు ప్రాంతాల్లో మాత్రమే ఈ సన్నివేశం వచ్చింది. మార్చడానికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఆ ప్రాంతంలో వన్యప్రాణుల హరించి పోతున్నాయని కారణంగా అక్కడ నుంచి తొలగించమని సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని మార్చడం జరిగిందని . తెలియజేశారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో భూములు కొన్న వ్యాపారస్తులు అయోమయ పరిస్థితిలో పడ్డారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి