పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యులు సిద్దయ్య గారి ఆరాధన.
దూదేకుల సిద్దయ్య బ్రహ్మంగారి శిష్యులలో ప్రముఖుడు 1665 కల్లు గొట్టు గ్రామము కోవెలకుంట్ల మండలము కర్నూలు జిల్లా జన్మించారు
ఆక్కడి నుంచి వచ్చి ముడుమాల లో నివాసం ఏర్పరచుకొని. నివాసముంటూ కులమత అంతరాలను విద్వేషాలకు సామాజిక అంతరాలను తీవ్రంగా వ్యతిరేకించి వ్యక్తిగా పేరు గాంచిన ఈయన ఆయనే సాటి.
బ్రహ్మంగారు జీవ సమాధిలో ప్రవేశించ తలచి సిద్ధయ్య తన దగ్గర ఉంటే తట్టుకోలేడని భావించి పూలు తెమ్మనే నెపంతో తోటకు పంపాడు. పూలకోసం వెళ్ళిన సిద్ధయ్య అక్కడెవరో తన గురువు జీవ సమాధి అవుతున్నాడని చెప్పగా విని పరుగున తిరిగి వచ్చాడు. అప్పటికే బ్రహ్మంగారు సమాధిలోని వెళ్ళిపోయాడు. సిద్ధయ్య తన గురువుకోసం రోదించి స్పృహ లేకుండా పడి ఉండగా ఆయనకు నిజరూప దర్శనమిచ్చి సంసార ధర్మాన్ని నిర్వర్తించమని ఆదేశించాడు. దాంతో సిద్ధయ్య వివాహం చేసుకుని పలువురు శిష్యులను కూడా చేర్చుకున్నాడు. 1736 వ సంవత్సరంలో జీవ సమాధి కావడం విశేషం
ఇలాంటి శిష్యుడు ఉన్నాడు కాబట్టే ఆయన చరిత్రలో నిలిచిపోయాడు
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి