బ్రహ్మంగారి మఠం లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం
భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తేదీన స్థాపించబడింది అటల్ బిహారీ వాజ్పేయి తొలి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు మొదటిసారిగా 1984లో ఇందిరాగాంధీ హత్య జరిగిన అనంతరం లోక్సభ ఎన్నికలలో 543 సీట్లలో ఒక్క ఆంధ్రప్రదేశ్ లోని హనుమకొండలో కేకే పటేల్ అనే అభ్యర్థి గెలుపొందారు గుజరాత్ లోని మోహష్ నియోజకవర్గంలో రెండో గెలుపు నమోదయింది .
ఆంధ్రప్రదేశ్ కు లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన జంగారెడ్డి ఇక ఎన్నికలలో వాజ్పేయి ఎల్కే అద్వానీ లాంటి మహా మహా నాయకులే పరాజయం పాలయ్యారు.
తర్వాత 1989లో అద్వానీ రథయాత్ర తో 88 సీట్లు గెలుచుకుని జనతాదళ్ లకు మద్దతునిచ్చి వి.పి.సింగ్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది
తర్వాత 1991లో ఆ సంఖ్య 120 పెంచుకుని ప్రధాన ప్రతిపక్షం గా మారింది. తరువాత 1996లో అతిపెద్ద రాజకీయ ప్రతిపక్షంగా అవతరించిన బీజేపీ అంచలంచలుగా ఎదిగింది. అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని అటల్ బిహారీ వాజ్పేయి ఆహ్వానించగా బీజేపీ లోక్సభ విశ్వాసం పొందుటలో వైఫల్యం చెంది 13 రోజులకే పతనమైంది.
అప్పుడు బిజెపి కి మూడు పార్టీలే మద్దతు పలికాయి (శివసేన, సమతా పార్టీ, హర్యానా వికాస్ పార్టీ) తర్వాత అంచలంచలుగా అభివృద్ధి చెందిన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ భాగస్వామ్యంతో 1999లో 303 సీట్లతో గెలిచే అప్పటి పరిస్థితుల్లో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ఎన్డీఏ బలోపేతం చేసింది
అంచలంచలుగా బిజెపి చరిత్ర ఈరోజు ఆవిర్భావ దినోత్సవం దొరకడం గత పది సంవత్సరాల నుంచి బిజెపికి తిరుగులేని ఆదిపత్యం తో కొనసాగుతున్న తిరుగులేని పార్టీగా ఏర్పడింది
బ్రహ్మంగారిమఠంలో ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొన్న బిజెపి మండల అధ్యక్షుడు చంద్ర ఓబుల్ రెడ్డి మండల ఇన్చార్జి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి