బ్రహ్మంగారి మఠం లో తుఫాన్ కు నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలి.
బ్రహ్మంగారి మఠం మండలం లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి .
అ
సానితుపాను ప్రభావంతో గత రెండు రోజులుగా పడుతున్న వర్షాల ధాటికి బ్రహ్మంగారిమఠం మండలంలోని పలు గ్రామాలలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి చంద్రఓబుల్రెడ్డి అన్నారు .రెండు మూడు రోజుల్లో చేతికి అందివచ్చే పంట వర్షం ధాటికి తడిసి ముద్దివ్వడమే కాకుండా మరొక తలెత్తడంతో ఎందుకు పనికిరాకుండా పోయిందన్నారు .ముఖ్యంగా నరసింహాపురం ,గుండా పురం , గోడ్లవీడు గ్రామాల పరిధిలో సాగు వేసిన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు .చేతికి అందివచ్చే వరిపంట నేలకొరిగిందన్నారు .పత్తి తీతలు మొదలయ్యే సమయంలో గాలి బీబోత్సవానికి పత్తి నేల రాలిపోవడం తో తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు .వ్యవసాయశాఖ అధికారులు పంటలను పరిశీలించి తీవ్రంగా నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ తరపున తెలియజేస్తున్నాము
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి