బ్రహ్మంగారి మఠం బ్రహ్మ సాగర్ లో ఇద్దరు గల్లంతు బయటపడ్డ మృతదేహాలు
కడప జిల్లా:
బ్రహ్మంసాగర్ జలాశయంలోఇద్దరు వ్యక్తులు గల్లంతు .మృతదేహాల కోసం గాలిస్తున్న పోలీసులు
నెల్లూరు జిల్లా కందుకూరు కు చెందిన శ్రీను(45), పొద్దుటూరు కు చెందిన సాంబశివరావు(50) లు గా గుర్తించిన పోలీసులు ఆదివారం కావడంతో జలాశయం వెళ్లి తెప్ప లో విహరించే క్రమంలో గాలులు ఉదృతంగా వీయడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం కందుకూరుకు చెందిన శ్రీను బ్రహ్మంగారిమఠం మండల ప్రాంతంలో ఉద్యానవన పంటలను లీజుకు తీసుకుని వ్యాపారం సాగిస్తున్నారు వీరికి ప్రొద్దుటూరుకు చెందిన సాంబశివరావు ఈ వ్యాపారంలో సహాయ సహకారం అందిస్తూ ఉంటారు
ఆదివారం సందర్భంగా గా ఇరువురు విందు ఏర్పాటు చేసుకుని జలాశయం వద్ద ఉన్న తెప్ప వేసుకుని నీటిలోకి వెళ్ళారు తెప్పలో వెళ్తుండగా అదే సమయంలో ఈదురు గాలులు ఎక్కువ కావడం వల్ల జలాశయంలో నీటి అలల ఉధృతి ఎక్కువైంది .ఈ నేపథ్యంలో దెబ్బ బోల్తా పడడంతో వీరిరువురు నీటిలో మునిగిన ట్లు సమాచారం.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి