బారుగా మార్చిన మందుబాబులు.
ఖాజీపేట మందుబాబులు రోజురోజు విచ్చలవిడిగా మందు తాగి ఎక్కడంటే ఎక్కడ బాటిల్ ఇష్టానుసారంగా బాటిల్లు పగలగొట్టడం అటు రైతులను పిల్లలను తీవ్ర అసహనానికి గురి చేస్తున్న మందుబాబులపై చర్యలు తీసుకోవాలని రైతుల ఆవేదన చెందుతున్నారు. అంతేకాకుండా వ్యవసాయ భూములలో దగ్గర తాగిన మందు బాటిల్ లను ఇష్టానుసారంగా పగలగొట్టడంతో కుచ్చుకొని ఇప్పటికే చాలామంది ఆసుపత్రులు పాలవడం ఒక ఎత్తు అయితే
ప్రధానంగా ఒకే చోట సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉండడంవల్ల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఆ దారిలో వెళ్లడం వారు చూస్తుండగానే మద్యం సేవిస్తున్న మందుబాబులకు పడవేసిన సిగరెట్లు వాటిని తీసుకుని విద్యార్థులు తాగి ధూమ మద్యపానాలకు బానిసలు అవుతున్నారు
ఎక్కడ స్థలం లేనట్టు ఇండ్ల మరియు హాస్టల్గు వెళ్లే దారిలో ఇష్టానుసారంగా మద్యం విద్యార్థులకు ఇటు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే. ఆ దారిలో విద్యార్థులు వెళుతున్నారన్న ధ్యాస కూడా లేకుండా మందుబాబులు ఇష్టాన్నిసారంగా ప్రవర్తించడం విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం మారుతుందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సేవించిన మద్యం బాటిళ్లు విద్యార్థి వెళ్లే రహదారి పక్కనే పడి వేయడం వల్ల విద్యార్థులు భవిష్యత్తులో మద్యానికి బానిసై కావడంతోపాటు విద్యార్థుల చదువులు ప్రశ్నార్థకంగా మారుతాయి అలా మద్యం చేస్తున్న వారిని స్కూలు మరియు హాస్టల్లో పరిసర ప్రాంతాలలో తాగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
గత కొద్దికాలంగా కాజీపేటలో పోలీసులు సంచారం లేకపోవడంతో ఇలాంటి సంఘటన జరుగుతున్నాయని స్కూల్లో ఇండ్ల మధ్యలోనైనా ఇలాంటి అసంఘీక కార్యక్రమాలు జరగకుంటే బాగుంటుందని కొందరు ఇంటి యజమానులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి