ఖాజీపేట మా నమ్మకం నువ్వే జగనన్న.
ఖాజీపేట మండల పరిధిలోని దుంపలగట్టు గ్రామములో ఈరోజు ఉదయం " మా నమ్మకం నువ్వే జగన్ " కార్యక్రమాన్ని రెడ్యం రామ కృష్ణరెడ్డి మరియు వైసిపి మండల యువ నాయకుడు తవ్వా కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు
ఈ సందర్భంగా మండల యువ నాయకుడు తవ్వా కిషోర్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ గతంలో చంద్రబాబు పాలనలో జరిగిన మోసాన్ని ప్రస్తుతం జగన్ పాలనలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధిని ప్రజలకు వివరించడం జరిగింది. ఈసారి ఎన్నికల్లో కూడా జగన్ ను సీఎం చేసుకుంటే ఇలాంటి సంక్షేమ పథకాలు మరెన్నో ప్రవేశ పెడతారని తవ్వా కిషోర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో గృహసారదులు, మరియు గ్రామ వాలంటీర్స్ దుంపల గట్టు పంచాయతీలోని వైసీపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి